England's Final Squad: భారత్ తో తొలి టెస్టు. ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే!
ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే!

England's Final Squad: భారత క్రికెట్ జట్టుతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 మందిని ప్రకటించింది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని మొదటి మ్యాచ్ జూన్ 20 నుండి లీడ్స్ లోని హెడింగ్లీలో జరుగుతుంది. ఓల్లీ పోప్ 3వ స్థానంలో ఆడతారు. వార్విక్షైర్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ డిసెంబర్ 2024 తర్వాత తొలిసారి జట్టులోకి తిరిగి వచ్చాడు. డర్హామ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ తన తొలి టెస్ట్ మ్యాచ్ను సొంతగడ్డపై ఆడనున్నాడు. అతను తన చివరి ఐదు టెస్ట్ మ్యాచ్లను పాకిస్తాన్, న్యూజిలాండ్లలో ఆడాడు.ఇక ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన 21 ఏళ్ల జాకబ్ బెథెల్ను ఇంగ్లాండ్ తమ తుది జట్టు నుంచి తప్పించింది. అతడు న్యూజిలాండ్పై మూడు హాఫ్ సెంచరీలు, వెస్టిండీస్తో వన్డే సిరీస్ 82 రన్స్ చేశాడు. కానీ, టెస్టుల్లో అనుభవం లేకపోవడంతో తొలి టెస్టుకు ఎంపికచేయలేదని తెలుస్తోంది.
తొలి టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టోంగ్, షోయబ్ బషీర్.
