Fifth T20 Against Sri Lanka: శ్రీలంకతో ఐదో టీ20..సిరస్ క్లీన్ స్వీప్ పై ఇండియా గురి
సిరస్ క్లీన్ స్వీప్ పై ఇండియా గురి

Fifth T20 Against Sri Lanka: ఈ రోజు భారత మహిళా క్రికెట్ జట్టుకు చాలా కీలకం. శ్రీలంకతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా చివరి , ఐదో టీ20 జరగనుంది.గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.ఇప్పటికే భారత్ 4-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్ గెలిచి శ్రీలంకను క్లీన్ స్వీప్ (5-0) చేయాలని చూస్తోంది.మరో వైపు ఒక్క మ్యాచ్ అయినా గెలిచిన పరువు నిలపుకోవాలని లంక చూస్తోంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉన్నా..ఫీల్డింగ్ లో తడబడుతోంది. ఫీల్డింగ్ లో గనుక రాణిస్తే ఇండియా ఈ మ్యాచ్ గెలవడం చాలా ఈజీ
స్మృతి మంధానపై అందరి ఫోకస్
ఈ మ్యాచ్ స్మృతి మంధానకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. ఆమె ఈ మ్యాచ్లో 62 పరుగులు చేస్తే, 2025 క్యాలెండర్ ఇయర్లో పురుషులు, మహిళలు అందరిలోకీ కలిపి అత్యధిక పరుగులు (1,765+) చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుతానికి శుభ్మన్ గిల్ (1,764 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నారు. గత మ్యాచ్లోనే (4వ టీ20) ఆమె 80 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అదే జోరును నేడు కూడా కొనసాగిస్తే రికార్డు ఖాయం.

