కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి అవుట్

Team India Squad: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నారు.

గాయం కారణంగా రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ప్రధాన వికెట్ కీపర్‌గా, ఎన్. జగదీశన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యారు. అలాగే, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించని కరుణ్ నాయర్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా జట్టులో అవకాశం లభించింది.

ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో, రెండో టెస్ట్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.

భారత జట్టు (టెస్టు సిరీస్):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్),యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్,సాయి సుదర్శన్,దేవదత్ పడిక్కల్,ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్),వాషింగ్టన్ సుందర్,జస్‌ప్రీత్ బుమ్రా,అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి,ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్),ప్రసిద్ధ్ కృష్ణ,మహ్మద్ సిరాజ్,కుల్దీప్ యాదవ్

PolitEnt Media

PolitEnt Media

Next Story