Former cricketer Mohammad Kaif: టీమిండియా వర్ధమాన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నితీశ్ రెడ్డిని పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా పరిగణించలేమని కైఫ్ అభిప్రాయపడ్డారు.

నితీశ్ రెడ్డి బ్యాటింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నప్పటికీ, బౌలింగ్‌లో ఇంకా అంతర్జాతీయ స్థాయికి చేరుకోలేదని కైఫ్ అభిప్రాయపడ్డారు. "అతను 130-135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు, కానీ వికెట్లు తీసేంత లేదా బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత ప్రభావం చూపడం లేదు" అని అన్నారు. హార్దిక్ పాండ్యా లాంటి మెయిన్ ఆల్‌రౌండర్ జట్టులో లేనప్పుడు, నితీశ్ రెడ్డి ఆ లోటును భర్తీ చేస్తాడని భావించడం సరికాదని, అతను కేవలం ఒక "బ్యాటింగ్ ఆల్‌రౌండర్" మాత్రమేనని కైఫ్ పేర్కొన్నారు.

విదేశీ పిచ్‌లపై, ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నితీశ్ రెడ్డి బౌలింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలని ఆయన అన్నారు.

కైఫ్ విమర్శలు ఇలా ఉన్నప్పటికీ, నితీశ్ రెడ్డి తన కెరీర్ ఆరంభంలోనే కొన్ని కీలక విజయాలను అందుకున్నారు.బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అటు బ్యాట్‌తో (హాఫ్ సెంచరీ), ఇటు బంతితో (2 వికెట్లు) అద్భుత ప్రదర్శన చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఆడి, ఫినిషర్‌గా, అవసరమైనప్పుడు బౌలర్‌గా రాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.

త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ 2026 ముఖ్యమైన విదేశీ పర్యటనల దృష్ట్యా, భారత్‌కు ఒక బలమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్ దొరకని సమయంలో నితీశ్ రెడ్డి తెరపైకి వచ్చారు. అందుకే కైఫ్ లాంటి సీనియర్లు అతనిపై విశ్లేషణలు చేస్తున్నారు.

Next Story