ఇంగ్లాండ్ కు గంభీర్

Gautam Gambhir: తన తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్కు తిరుగుపయనం అవుతున్నాడు. ఇవాళ టీమిండియాతో కలవనున్న గౌతీ ఈ నెల 20 నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో మొదలయ్యే తొలి టెస్టుకు ముందు జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు.

ప్రస్తుతం గంభీర్ తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇవాళ బయలుదేరి టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. గంభీర్ గైర్హాజరీలో బెకెన్హామ్ ఇండియా, ఇండియా - ఎ జట్ల మధ్య జరిగిన ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ను అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే, బ్యాటింగ్ కోచ్ సితాను కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షించారు.

జూన్ 12న గంభీర్ తల్లి సీమా గుండెపోటుతో ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరాు. 5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ లో ఉన్న గంభీర్ తన కుటుంబంతో కలిసి ఉండటానికి గంభీర్ స్వదేశానికి తిరిగి వచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story