ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా జట్టును ఖరారు చేశారు. మొదట నుంచీ అనుకున్నట్లే గిల్‌కు కెప్టెన్‌ రెస్పాన్సిబిలిటీస్‌ అప్పగించారు. అయితే, ఈ కొత్త జట్టును పాత కొత్తల కలయికతో రూపొందించారు. కొత్తవాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అందరితో కూడిన టీమిండియా జట్టును ఎంపిక చేశారు. అంటే.. దీని వెనుక భారీగానే కసరత్తు చేసినట్లు అర్థమవుతోంది.



కొత్త జట్టు ప్రకటనతో.. భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం మొదలయ్యింది. టెస్ట్‌ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్‌మన్‌గిల్‌ను బీసీసీఐ సెలెక్ట్‌ చేసింది. అందరూ మొదటినుంచీ ఊహించినట్లుగానే టెస్టు టీమ్‌ కెప్టెన్సీ పగ్గాలను శుభ్‌మన్‌ గిల్‌కు అప్పగించింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్న టీమ్‌ఇండియా జట్టును కూడా బీసీసీఐ శనివారం ప్రకటించింది. కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ను ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్‌ టూర్‌ కోసం జట్టును ప్రకటించింది. జూన్‌ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది.



ఇండియా టీమ్‌లో వీళ్లే...



శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌)


రిషభ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌)


యశస్వి జైస్వాల్‌


కేఎల్‌ రాహుల్‌


సాయి సుదర్శన్‌


అభిమన్యు ఈశ్వరన్‌


కరుణ్‌ నాయర్‌


నితీశ్ కుమార్‌ రెడ్డి


రవీంద్ర జడేజా


ధ్రువ్‌ జురెల్‌


వాషింగ్టన్‌ సుందర్‌


శార్దూల్‌ ఠాకూర్‌


జస్‌ప్రీత్ బుమ్రా


సిరాజ్‌


ప్రసిధ్‌ కృష్ణ


ఆకాశ్‌ దీప్‌


అర్ష్‌దీప్‌ సింగ్‌


కుల్‌దీప్‌ యాదవ్‌



సాయి సుదర్శన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌తోనే టెస్టుల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, కరుణ్‌ నాయర్‌ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చివరిసారిగా కరుణ్‌ నాయర్‌ 2017 మార్చిలో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. టెస్టు క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్‌ ఇవ్వడంతో నెంబర్‌ 3 స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో సాయి సుదర్శన్‌ లేదా కరుణ్‌ నాయర్‌ను తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న షమీతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఇంగ్లండ్‌ టూర్‌కు టీమ్‌లో చోటు లభించలేదు.




Politent News Web4

Politent News Web4

Next Story