BCCI Issues Serious Warning: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు గట్టి షాక్ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు (Slow Over-rate) బీసీసీఐ ఆయనకు రూ. 12 లక్షల జరిమానా విధించింది.

ఓవర్ రేట్ విషయంలో వెనుకబడటంతో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఫీల్డింగ్ నిబంధనల ప్రకారం ఎస్ఆర్‌హెచ్ శిక్ష అనుభవించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో సర్కిల్ వెలుపల కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచేందుకు అనుమతి లభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 168/5 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి.

కేవలం కమిన్స్ మాత్రమే కాదు, ఈ సీజన్‌లో ఇప్పటికే ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవుట్ అయిన తర్వాత అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసినందుకు గాను, ఆయన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా ఇచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఈ సీజన్‌లో వివాదంలో చిక్కుకున్నారు. లైవ్ బ్రాడ్‌కాస్ట్ జరుగుతున్న సమయంలో టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (Vaping) చేస్తూ కనిపించడంతో బీసీసీఐ ఆయనపై భారీ జరిమానా విధించి, డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీల ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా అన్ని జట్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story