IPL2025 ఛాంపియన్ జట్టుకు ఎన్ని కోట్లు ఇస్తారు?

IPL2025:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్ బిగ్ ఫైట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడనున్నాయి. ఆర్‌సీబీ 9 సంవత్సరాల తర్వాత ఫైనల్‌కు చేరుకోగా, పంజాబ్ కింగ్స్ 11 సంవత్సరాల తర్వాత ఫైనల్ ఆడేందుకు సిద్ధం అయింది. రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుస్తారో చూడటానికి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్‌లో ఛాంపియన్ జట్టుకు లభించే ప్రైజ్ మనీపై ఉత్సుకత నెలకొంది. ఐపీఎల్ 2025 విజేత జట్టు దాదాపు 20 కోట్ల రూపాయల (సుమారు $2.4 మిలియన్లు) ప్రైజ్ మనీని గెలుచుకునే అవకాశం ఉంది. రన్నరప్ జట్టు దాదాపు 13 కోట్ల రూపాయలు (సుమారు $1.56 మిలియన్లు) అందుకుంటుందని సమాచారం. ఈ ప్రైజ్ మనీలో ఎటువంటి మార్పులు ప్రకటించబడలేదు. ఇది 2022 నుండి అదే మొత్తంలో కొనసాగుతోంది. మరోవైపు చిన్నస్వామి స్టేడియం చుట్టూ జెర్సీలు భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి, ఫైనల్ మ్యాచ్ చూడటానికి ప్లాన్ చేసుకున్న అభిమానులు ఇప్పటికే వాటిని కొనడానికి ఎగబడుతున్నారు. RCB జెర్సీలు రూ.300కి, RCB గోల్డెన్ జెర్సీలు రూ.600కి, RCB క్యాప్స్ రూ.200కి, మఫ్లర్లు రూ.200కి అమ్ముడవుతున్నాయి. దీనికంటే ఎక్కువ రేటుకు పంజాబ్ జెర్సీలు అమ్ముడవుతుండటం విశేషం

PolitEnt Media

PolitEnt Media

Next Story