అయినా సిరీస్ మనదే..

India Clinches the Series: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20లో ఉమెన్స్ ఇండియా ఓటమి పాలైంది. నిన్న అర్థరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలీ వర్మ ఇండియా తరపున 75 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. చార్లీ డీన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌ దక్కగా..‌ సిరీస్ లో 10 వికెట్లు తీసిన శ్రీచరణికి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌ అవార్డులు లభించాయి.

ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, భారత మహిళల జట్టు 3-2 తేడాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్లాండ్‌పై భారత మహిళల జట్టుకు ఇది మొదటి టీ20 సిరీస్ విజయం కావడం విశేషం. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 16న సౌతాంప్టన్‌లో మొదలు కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story