సెమీస్ కు భారత్

FIH Junior Hockey World Cup: ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 (FIH Men's Junior Hockey World Cup 2025)లో భారత జట్టు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది.నిర్ణీత సమయంలో 2-2తో సమం అయిన తర్వాత, షూటౌట్‌లో భారత్ 4-3 తేడాతో బెల్జియంను ఓడించి సెమీస్ లోకి ప్రవేశించింది. ఇందులో శ్రద్దానంద్‌‌ తివారీ మూడు గోల్స్‌‌ కొట్టాడు. అంకిత్‌‌ పాల్‌‌ ఒకసారి బంతిని గోల్‌‌ పోస్ట్‌‌లో పంపాడు. మధ్యలో గోల్‌‌ కీపర్‌‌ ప్రిన్స్​దీప్​ రెండుసార్లు ప్రత్యర్థులు కొట్టిన షాట్లను అద్భుతంగా అడ్డుకుని ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్వార్టర్-ఫైనల్‌లో విజయం సాధించిన తరువాత, భారత్ ఇప్పుడు ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీ జట్టుతో సెమీ-ఫైనల్‌లో తలపడుతుంది. డిసెంబర్ 7న తమిళనాడులోని చెన్నై , మధురైలో జరుగుతోంది. మరో సెమీ ఫైనల్ స్పెయిన్ vs అర్జెంటీనా మధ్య జరగనుంది. భారత జట్టు ఇప్పటికే రెండు సార్లు (2001, 2016లో) ఈ జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story