తొలి టీ20 సమరం

India Vs England First T20: ఇంగ్లండ్ విమెన్స్ జట్టుతో ఇండియా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య నేడు తొలిమ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టు కుని ఈ సిరీస్లో సత్తా చాటాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎడిషన్లో గ్రూప్ దశలోనే నిష్క్ర మించడంతో ఈ సారి అలాంటి ఫలితం పునరావృతం కావొద్దని ఇండియా భావిస్తోంది. ఇంగ్లండ్లో ఆడటం వల్ల పిచ్ లు, వాతావరణ పరిస్థితులపై ఓ అంచనాకు రావొచ్చని ఆశిస్తోంది.

హార్ట్ హిట్టర్ షెఫాలీ వర్మ రాకతో ఇండియా బ్యాటింగ్ బలోపేతం అయ్యింది. స్మృతి మంధానాతో కలిసి ఓపెనింగ్ చేయనుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా, రిచా ఘోష్ మెరిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. కొత్త ముఖాలు క్రాంతి గౌడ్, శ్రీ చరణి, సయాలీ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఇది తొలి టీ20 సిరీస్కావడంతో ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ స్నేహ్ రాణా, పేసర్ అమన్ జోత్ కౌర్పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మరోవైపు ఇంగ్లండ్ సొంతగడ్డ పై చాలా బలంగా కనిపి స్తోంది. సివర్ బ్రింట్, అమీ జోన్స్, టామీ బ్యూమోంట్, డ్యానీ వ్యాట్, సోఫీ ఎకెల్టైన్తో పాటు యంగ్స్టర్స్ ఇసీ వాంగ్, అలైస్ క్యాప్సీ, సోఫియా దండ్లే సూపర్ ఫామ్లో ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story