విజయానికి అతనే కారణం!

India vs England: సచిన్-ఆండర్సన్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ను 5 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా గెలిచి టీమిండియా సిరీస్‌ను సమం చేసింది. ఒకానొక సమయంలో, టీం ఇండియా దారుణంగా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిలో అద్భుతమైన బౌలింగ్ దాడికి నాయకత్వం వహించిన మహ్మద్ సిరాజ్ విజయానికి హీరో అయ్యాడు. సిరాజ్ 2వ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి మెరిశాడు. అంతేకాకుండా మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూడా తీసుకున్నాడు.` ఒకానొక సమయంలో 301 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ను సులభంగా గెలుస్తుందని భావించారు. అయితే, చివరి నిమిషంలో సిరాజ్, ప్రసీద్ లు మ్యాచ్ ను మలుపు తిప్పి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ కు పీడకలగా మారారు.రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 104 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలీ, ఓలీ పోప్, జామీ స్మిత్, ఓవర్టన్ అట్కిన్సన్ వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూడా పడగొట్టాడు. మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసీద్ కృష్ణ 126 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డకెట్, రూట్, బెథెల్ జోష్ టోంగ్ వికెట్లను తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతను 4 వికెట్లు పడగొట్టాడంతో ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి జట్టును గెలిపించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story