జోరూట్ అరుదైన రికార్డ్..

Joe Root: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్‌పై 3 వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు.33 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356*, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్‌ చేశారు. ఈ టెస్టులో 99 పరుగుల స్కోర్‌ వద్ద రూట్‌ ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్‌ పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇటీవల (జులై 2025) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 99 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు భారత్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్‌పై అతడు మరో సెంచరీ సాధిస్తే, స్టీవ్ స్మిత్ రికార్డును (భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు - 11) సమం చేస్తాడు.

జో రూట్ 2017 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు (64), విజయాలు (27), ఓటముల (26) రికార్డులు అతని పేరిట ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story