IPL2025: గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ
కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ

IPL2025:ఎట్టకేలకు 18 ప్రయత్నంలో కోహ్లీ తన ఐపీఎల్ కప్ కలను నెరవేర్చుకున్నారు. పంజాబ్ కింగ్స్ పై గెలిచి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఎప్పటిలాగే ఐపీఎల్ 2025 సీజన్ లో జట్టును ముందుండి నడిపించగా.. మిగతా ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించడంతో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఆర్సీబీ విజయం ఖరారైన తర్వాత కోహ్లీ మోకాళ్లపై గ్రౌండ్ లో కన్నీళ్లు పెట్టుకున్న క్షణం ప్రతి ఒక్కరి మనసుని హత్తుకుంది. కెప్టెన్ రజత్ పటిదార్ ఐపీఎల్ ట్రోఫీ గెలవగానే సెలెబ్రేట్ చేసుకొని కోహ్లీ చేతికి ట్రోఫీ అందించాడు
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. 18 ఏండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్ గెలవడం నమ్మశక్యం కాని అనుభూతినిస్తోందన్నాడు. ఈ విజయాన్ని మా టీమ్మేట్స్కు, మమ్మల్ని ఎంతగానో ఆదరించిన అభిమానులకు అంకితం చేస్తున్నా. ఇక మా నినాదం ఈ సాలా కప్ నమ్దే కాదు.. ఈసాలా కప్ నమ్దూ. ఏబీ డివిలియర్స్ కూడా ఈ విజయంలో భాగస్వామే. తను మాతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి. నా కెరీర్లో ఇది ఎంతో ముఖ్యమైన విక్టరీ. నా మనసంతా బెంగళూరుతోనే ఉంది, అందుకే ఈ జట్టుతో గెలవడం నాకు చాలా స్పెషల్. నేను ఐపీఎల్ ఆడేంత వరకు ఆర్సీబీతోనే ఉంటా. ఇంత పెద్ద టోర్నమెంట్లో గెలవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రాత్రి నాకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇకపై నేను ఆడే కొద్ది సంవత్సరాల్లోనూ నా పూర్తి శక్తిని ఇవ్వాలనుకుంటున్నా. ఈ ప్రస్తుత ఆర్సీబీ యాజమాన్యం, ఆటగాళ్ల బృందం చాలా గొప్పది. అందరి సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. ఇది మా అందరి విజయం, బెంగళూరు విజయం. ఈ ఐపీఎల్ ట్రోఫీ చాలా గొప్పదే అయినా నా దృష్టిలో టెస్ట్ క్రికెట్టే ఎప్పుడూ అన్నింటికన్నా గ్రేట్. యువ ఆటగాళ్లందరూ టెస్ట్ క్రికెట్ను గౌరవించాలి అని చెప్పాడు కోహ్లీ
