జీవితాలు ముఖ్యం: కపిల్ దేవ్

Kapil Dev: ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు బహిరంగంగానే స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగి 11 మంది ప్రాణాలు పోవడం బాధాకరమని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. సంబురాల కంటే జీవితాలు గొప్పవని అన్నాడు. భవిష్యత్లోనైనా ఇలాంటివి జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. జరిగిన సంఘటన నన్ను కలిచి వేసిందని చెప్పాడు.

మనం ఒకరి నుంచి ఒకరం నేర్చుకో వాలి. ఇలాంటి సంబురాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పు అనేది సరదాగా గడిపి ప్రాణాలు కోల్పోయేంత పెద్దదిగా ఉండకూడదు. భవిష్యత్లో ఏదైనా జట్టు గెలిస్తే దానికి సంబంధించి వేడుకలు ప్రశాంతంగా చేసుకోండని కపిల్ వ్యాఖ్యానించాడు.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సెలబ్రేషన్స్ ను వ్యతిరేకించాడు. తానెప్పుడూ రోడ్‌‌‌‌ షోలను నమ్మనని చెప్పాడు. వీటికంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవని అని అన్నాడు. మరోవైపు తొక్కిసలాట మృతులకు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నివాళి అర్పించాడు. ఇది మాటలకందని విషాదమని వ్యాఖ్యానించాడు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story