అరుదైన గౌరవం

Neeraj Chopra Receives a Rare Honor: ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ (Honorary Lieutenant Colonel) హోదాను ప్రదానం చేసింది.ఈ గౌరవ హోదాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు అందించారు.

నీరజ్ చోప్రా 2016 ఆగస్టులో నాయిబ్ సుబేదార్ (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్)గా భారత సైన్యంలో చేరారు.క్రీడల్లో ఆయన సాధించిన అసాధారణ విజయాలు, దేశానికి అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవ హోదా లభించింది.ఆయనకు టెరిటోరియల్ ఆర్మీ (ప్రాదేశిక సైన్యం)లో ఈ హోదా లభించింది.క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ వంటి ప్రముఖులకు కూడా గతంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది.

ఒలింపిక్స్ (టోక్యో 2020)లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకం (Gold Medal) సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారు. (పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రజత పతకం (Silver Medal) గెలుచుకున్నారు). ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతకం గెలిచారు. ఆసియా క్రీడలు & కామన్వెల్త్ క్రీడలు రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించారు.నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం, పానిపట్ జిల్లాకు చెందినవారు. ఆయన క్రీడాకారుడిగా, సైనికుడిగా దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story