PV Sindhu Makes Key Announcement: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు ప్రకటించారు. పాదానికి (Foot Injury) అయిన గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

యూరోపియన్ లెగ్‌కు ముందు ఆమెకు పాదానికి గాయం అయ్యింది. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరియు దీర్ఘకాలిక ఫిట్‌నెస్ కోసం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె 2025 సంవత్సరంలో మిగిలిన అన్ని BWF (Badminton World Federation) టూర్ ఈవెంట్స్ నుండి వైదొలిగారు. ఆమె జనవరి 2026 నాటికి కోర్టులోకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సింధు ప్రస్తుతం వైద్య, ఫిట్‌నెస్ బృందాల పర్యవేక్షణలో పునరావాసం (Rehabilitation) , శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. గాయాలు అథ్లెట్ జీవితంలో భాగమేనని, అవి సహనాన్ని పరీక్షిస్తాయని, అయితే మరింత బలంగా తిరిగి రావడానికి నిప్పు రాజేస్తాయని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు.ఈ తాత్కాలిక విరామం, ముఖ్యంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం ఆమె సిద్ధం కావడానికి ఒక వ్యూహాత్మక చర్యగా ఆమె బృందం పేర్కొంది.

Next Story