బోణీ కొట్టిన పీవీ సింధు

PV Sindhu: పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో విజయంతో బోణీ కొట్టింది. బుధవారం (జులై 23) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో, సింధు ప్రపంచ 6వ ర్యాంకర్, జపాన్‌కు చెందిన టోమోకా మియాజాకిని 21-15, 8-21, 21-17 తేడాతో మూడు గేమ్ లలో ఓడించి రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంది. ఇది సింధుకు 2025లో టాప్-10 ప్రత్యర్థిపై సాధించిన అతి పెద్ద విజయం.

తదుపరి రౌండ్‌లో సింధు తన సహచర భారతీయ క్రీడాకారిణి ఉన్నతి హూడాతో తలపడుతుంది. గతంలో, సింధు 2016 చైనా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి, టోర్నమెంట్‌లో మరింత ముందుకు వెళ్లేందుకు సహాయపడుతుంది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సింధు.. ఈ గెలుపు తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ముందుకు సాగడానికి ఇది ఎంతో అవసరమనితెలిపింది.గతంలో సింధు 2016లో చైనా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story