RCB: ఆర్సీబీ అమ్మకంపై యజమాన్యం క్లారిటీ..
యజమాన్యం క్లారిటీ..

RCB: ఆర్సీబీ ఇటీవలే ఐపీఎల్ 18 సీజన్ లో తొలిసారి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే..టైటిల్ గెలవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీ విలువ భారీగా పెరిగింది . దీంతో కొన్ని వాటాలు అమ్మి సొమ్ము చేసుకోవాలని ఫ్రాంచైజీ భావించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలని అందులో ఎలాంటి నిజం లేదని యజమానులు స్పష్టం చేశారు.
తాము ఎలాంటి వాటాలు అమ్మడం లేదని, వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని వెల్లడించింది. ఇండియాలో పొగాకు, ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్పై నిషేధం ఉన్నప్పటికీ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఇతర మార్గాలున్నాయని తెలిపింది. ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్కు ఆర్సీబీ అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదు. డియాజియో కంపెనీ ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేయాలో మాకు తెలుసు. ఇప్పటికైతే ఆర్సీబీలో ఎలాంటి వాటాలు అమ్మడం లేదని ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐపీఎల్ ఆరంభంలో ఆర్సీబీని కొనుగోలు చేసిన విజయ్ మాల్యా.. తర్వాత జరిగిన పరిణామాలతో ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు. దీంతో డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని నడిపిస్తోంది. ప్రతీ ఏడాది ఐపీఎల్ విలువ భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుత యజమానులకు ఇది ప్రతిష్టాత్మకమైన ఆస్తుల్లో ఒకటిగా మారిపోయింది.
