IPL2025:18 ఏళ్ల కల.. ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ కొట్టిన ఆర్సీబీ
ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ కొట్టిన ఆర్సీబీ

IPL2025: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెగా లీగ్లో కొత్త చాంపియన్గా అవతరించింది. 18వ సీజన్ మెగా ఫైనల్లో ఆర్సీబీ 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ పోరులో తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (35 బాల్స్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (3/40), కైల్ జెమీసన్ (3/48) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (30 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ (2/17), భువనేశ్వర్ కుమార్ (2/38) చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రునాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఆడి జట్టు భారీ స్కోర్ చేయడంలో సహకరించారు. 43 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, అర్షదీప్ తలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓమార్జాయి, చాహల్, విజయ్ కుమార్ వైశుక్ తలో వికెట్ తీసుకున్నారు.
