నెంబర్.1 ర్యాంకింగ్ లో స్మృతి మంధాన

Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ర్యాంకింగ్స్ లో 727 రేటింగ్ పాయింట్లతో టాప్ కు చేరుకుంది. సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ లారా వోల్వార్డ్ట్‌ను వెనక్కి నెట్టిన మంధాన ఆరేళ్ళ తర్వాత తిరిగి వన్డేల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విశేషం. చివరిసారిగా స్మృతి 2019లో నెంబర్ 1 ర్యాంక్ లో నిలిచింది. ఇటీవల వెస్టిండీస్‌‌‌‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 27, 28 స్కోర్లు మాత్రమే చేసిన లారా 19 రేటింగ్ పాయింట్లను కోల్పోయి ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది.

ప్రస్తుతం మంధాన 727 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌లో ఉండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ సివర్-బ్రంట్ (719) రెండో ప్లేస్‌లో నిలిచింది. ఇండియా బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ వరుసగా 14, 15వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. కాగా, ఈ నెల చివర్లో ఇండియా విమెన్స్ టీమ్.. ఇంగ్లండ్‌‌ టూర్​కు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ టీమ్‌ తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌ల్లో తలపడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story