South Africa Whitewash: సౌతాఫ్రికాతో వైట్ వాష్ ..రిషప్ పంత్ క్షమాపణలు
రిషప్ పంత్ క్షమాపణలు

South Africa Whitewash: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ తర్వాత స్టాండిన్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ, అభిమానులకు క్షమాపణ చెప్పాడు.తాము మెరుగైన క్రికెట్ ఆడలేదనే వాస్తవాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని, ఈసారి అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించాలని కోరాడు. తమకంటే మెరుగ్గా ఆడిన సౌతాఫ్రికాకు క్రెడిట్ ఇవ్వాలని చెప్పాడు. వారు సిరీస్ను ఆధిపత్యం చేశారని అంగీకరించాడు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, జట్టుగా మెరుగుపడాలన్నాడు.ఆటను తేలికగా తీసుకోకూడదని, మరింత స్పష్టమైన మనస్తత్వంతో ఆడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. కీలక సమయాల్లో బ్యాటింగ్ యూనిట్గా మేము అవకాశాలను ఉపయోగించుకోలేకపోయామని చెప్పాడు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం జీవితంలోనే గొప్ప గౌరవం అని, తాము కష్టపడి పనిచేసి, పునర్సమీక్షించుకుని, బలంగా తిరిగి వస్తామని హామీ ఇచ్చాడు.
‘గత రెండు వారాలుగా మేం బాగా ఆడలేదు. ఒక జట్టుగా, వ్యక్తులుగా మేం ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థాయిలో రాణించి కోట్లాది మంది దేశ ప్రజలను సంతోష పెట్టాలని కోరుకుంటాం. ఈసారి మేం అంచనాలను అందుకోలేకపోయినందుకు సారీ. కానీ, ఈ ఆట సవాళ్లను అధిగమించి జట్టుగా, వ్యక్తులుగా ఎదిగేలా మాకు పాఠాలు నేర్పిస్తుంది. ఈ టీమ్ సత్తా ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు మేం మరింత కష్టపడతాం. మా లక్ష్యంపై ఫోకస్ పెట్టి.. జట్టుగా, వ్యక్తులుగా మరింత బలంగా, మెరుగ్గా తిరిగొచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పంత్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.

