Three-match T20 Series: ఎట్టకేలకు భారత్ విక్టరీ..వైభవ్ విధ్వంసంతో జింబాబ్వే చిత్తు
జింబాబ్వే చిత్తు

Three-match T20 Series: వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ గెలిచాక ఆడిన రెండు సిరీస్ల్లోనూ వైట్వాష్కు గురైన టీమ్ ఇండియా.. ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది.జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత టీ20 సారథిగా ఏడు మ్యాచ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ మొదటి విజయాన్ని అందుకోవడం విశేషం.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మద్వీర (39), మరుమాని (27 నాటౌట్), ర్యాన్ బర్ల్ (26) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లతో రాణించారు.
అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని ఖాయం చేసుకుంది! యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి చెలరేగిపోగా.. ఇషాన్ కిషన్ 35, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో రాణించారు. ఘనమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవగా.. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.

