ఆ టీంతో ఒప్పందం

Hyderabad Cricket Association: ఐపీఎల్ ముగియడంతో ఒక్కొక్కరు కౌంటీ క్రికెట్ వైపు వెళ్తున్నారు. ఇప్పటికే రుతురాజ్‌ గైక్వాడ్‌ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ వర్మ చేరాడు. ఈ మేరకు హాంప్‌షైర్ ప్రతినిధులు తమను సంప్రదించారని హైదరాబాద్ క్రి కెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) బుధవారం తెలిపింది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎన్. ఠాకూర్ తిలక్ వర్మ యూకే కౌంటీల్లో బరిలోకి దిగనున్నాడు. హాంప్ షైర్తో అతని ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం. ఈ కౌంటీ తరఫున తిలక్ అత్యు త్తమంగా రాణిస్తాడని నమ్ముతున్నాం' అని హెచ్సీఏ తెలిపింది. ఐపీఎల్ లో ముంబై ఇండి యన్స్ కు ఆడుతున్న 22 ఏళ్ల తిలక్.. టీమిండియా తరఫున 25 టీ20ల్లో 749, 4 వన్డేల్లో 68 రన్స్ చేశాడు. ఇక కెరీర్ లో 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన తిలక్ 50.16 సగటుతో 1204 రన్స్ సాధించాడు.ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story