ఆర్సీబీ విక్టరీపై విజయ్ మాల్యా ట్వీట్

Vijay Mallya:ఐపీఎల్ లో తొలిసారి టైటిల్ కొట్టి 18 ఏళ్ల కల నెరవేర్చుకుంది ఆర్సీబీ. దీంతో ఆ జట్టు విజయంపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన ఎక్స్ లో స్పందించారు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2025 టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడింది. అత్యుత్తమ కోచింగ్, సహాయక సిబ్బందితో సమతుల్యమైన జట్టు. ఈ సాలా కప్ నమ్దూ. విజేతగా నిలిచిన ఆర్సీబీకి అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే తన కల మొత్తానికి నిజమైందన్నారు. ఆర్సీబీ జట్టులోకి విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్లను తీసుకున్న ఘనత తనదేనన్నాడు.

అయితే ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన విజయ్ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తు్న్నారు. దేశంలోని వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అభినందనలు తెలపడం కరెక్ట్ కాదని కొందరు.. ట్రోఫీ గెలిచావ్ కదా ఇకనైనా బ్యాంకులకు తిరిగి తీసుకున్న డబ్బులు కట్టేయ్ అని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.

2008లో జరిగిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీ వేలంలో విజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లకు ఆర్సీబీ ఫ్రాంచైజ్‎ను కొనుగోలు చేశాడు. తర్వాత బిజినెస్ లో నష్టాలు వచ్చి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో దేశంలోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టి 2016లో విజయ్ మాల్య దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story