తొలి సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్

Washington Sundar: భారత ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో తన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. ఈ సెంచరీ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి భారత్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం ఇచ్చిన తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓటమి అంచున నిలిచింది. ముఖ్యంగా లంచ్ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103), కేఎల్ రాహుల్ (90) ఔట్ అయిన తర్వాత, మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు మల్లుతున్నట్లు కనిపించింది.

అయితే రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్ ఐదవ వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అజేయంగా 203 పరుగులకు పైగా జోడించి, ఇంగ్లాండ్ బౌలర్లను నిరాశపరిచారు. చివరి రోజు ఆటలో, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా కోసం ప్రతిపాదన చేసినప్పటికీ జడేజా, సుందర్ తమ సెంచరీలను పూర్తి చేసుకోవడానికి నిరాకరించారు. చివరకు సుందర్ తన తొలి టెస్ట్ సెంచరీని, జడేజా తన ఐదవ టెస్ట్ సెంచరీని పూర్తి చేయగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి.

ఈ సెంచరీతో వాషింగ్టన్ సుందర్ తన బ్యాటింగ్‌లో ఉన్న సత్తాను నిరూపించుకున్నాడు, భారత టెస్ట్ జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story