భారత్,పాక్ మ్యాచ్ ఎపుడంటే.?

World Cup Schedule: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది. మొత్తం ఎనిమిది జట్లు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. 2025సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

సెప్టెంబర్ 30న ఆతిథ్య భారత్.. శ్రీలంకతో టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడుతుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రోజు అక్టోబర్ 1 న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.

అందరూ ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబో వేదికగా అక్టోబర్ 5 న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. 2022 రన్నరప్ ఇంగ్లాండ్ అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో ఆడనుంది. రౌండ్-రాబిన్ దశ అక్టోబర్ 26 వరకు జరుగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 29,30 తేదీలలో జరగనున్నాయి. నవంబర్ 2న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. రౌండ్-రాబిన్ లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీ ఫైనల్ ఆడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story