విజయం దిశగా

WTC FINAL: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో కొత్త విజేత రావడం దాదాపు ఖాయమైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ సౌతాఫ్రికా చేతుల్లోకి వచ్చేసింది. మూడో రోజు సఫారీ టీమ్ పూర్తిగా పై చేయి సాధించింది. ఓపెనర్ మార్ క్రమ్ అద్భుతమైన సెంచరీ,కెప్టెన్ బవుమా హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మరో 69 రన్స్ దూరంలో ఉంది. 282 టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ప్రస్తుతానికి రెండు వికెట్లు కోల్పోయి 213 రన్స్ చేసింది.
ఆసీస్ ఇచ్చిన 282 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో మూడో రోజు, శుక్రవారం చివరకు సౌతాఫ్రికా 213/2 స్కోరుతో నిలిచింది. మార్క్రమ్, బవూమ మూడో వికెట్కు అజేయంగా 143 రన్స్ జోడించి జట్టును గెలుపు ముంగిట నిలిపారు.. స్టార్క్ (2/53) రెండు వికెట్లు పడగొట్టాడు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్లో ప్రొటీస్ టీమ్ విజయానికి 69 రన్స్ అవసరం అవగా.. ఆసీస్కు వికెట్లు 8 అవసరం.
ఈ పరిస్థితుల్లో అద్భుతం చేస్తే తప్ప ఆసీస్ గెలిచే చాన్స్ లేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 207 రన్స్కు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (136 బాల్స్లో 5 ఫోర్లతో 58 నాటౌట్) ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. జోష్ హేజిల్వుడ్ (17)తో పదో వికెట్కు 59 రన్స్ జోడించాడు. సఫారీ బౌలర్లలో రబాడ నాలుగు, ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టారు.
