Bhageerath Shifted to Moinabad Farmhouse: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు.

బండి భగీరథ్ పై బాలికపై అత్యాచారం మరియు అసభ్య ప్రవర్తన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మే 16న అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్-మల్కాజ్‌గిరి కోర్టు ఆదేశించింది.

పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో భగీరథ్ నుంచి మరిన్ని విషయాలు, ఆధారాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. కోర్టు మూడు రోజుల కస్టడీ మాత్రమే మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి తీసుకువచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, తర్వాత మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు.

ఈ కేసు విచారణలో పోలీసులు కీలక మలుపు తీసుకుంటున్నారని సమాచారం. భగీరథ్‌ను మూడు రోజుల పాటు విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story