మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ

తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మంత్రి సీతక్క మౌనంగా ఉండటం పట్ల మావోయిస్టులు మండిపడ్డారు. ఈ మేరకు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు వార్నింగ్‌ ఇస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా సీతక్క స్పందించడం లేదని మావోయిస్టులో ఆ లేఖలో తీవ్రంగా ఆరోపించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా సీతక్క ఎందుకు పట్టించుకోవడం లేదని మావోయిస్టులు లేఖలో ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీనే తీసుకు వచ్చిన 1/70 చట్టాన్ని సీతక్క మర్చిపోయారా అని మావోయిస్టులు లేఖలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు కాపాడే బాధ్యత పూర్తిగా మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు స్పష్టం చేశారు. 49వ నెంబర్‌ జీవో జారీ చేసి కొమరం భీమ్‌ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని మావోయిస్టులు రాసిన లేఖలో ఆరోపించారు. ఈ జీవో కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగయ్యే పరిస్ధితులు నెలకొంటాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టేందుకే జీఓ నెం 49 తీసుకువచ్చారంటే కాంగ్రెస్‌ సర్కార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆ జీవో రద్దు చేసేలా సీతక్క చొరవ తీసుకోవాలని పేర్కొంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరిట లేఖ విడుదల చేశారు.

Updated On 27 Jun 2025 12:38 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story