• ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌
  • తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరం తెలంగాణపై జల ఖడ్గం అనే నినాదంతో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాక గ్రామల ప్రజలు ఆంధ్రాలో కలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నెల 25వ తేదీన ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిషా, చత్తీస్ఘడ్‌ సీయంతో నిర్వహించే ప్రధాని మోడీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ ఐదు గ్రామాలు వెనక్కి వచ్చేలా సీయం రేవంత్‌ రెడ్డి కేంద్రపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు ఆయన మాన్యం ఆంధ్రాకి వెళితే అక్కడ ఎవరూ పట్టించుకునే పరిస్ధితి లేకపోవడంతో దేవుడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని కవిత డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరాన్ని ఆపేందుకు తెలంగాణ జాగృతి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయ్యాక మొట్టమొదటి క్యాబినేట్‌ సమావేశంలోనే ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్‌ ఆమోదించి అన్యాయం చేశారని కవిత ఆరోపించారు. బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story