తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాదిన్నర పాలన పూర్తయిన సందర్భగా పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను విధ్వంసం నుంచి వికాసం వైపు అనే శీర్షికతో సంకలనం చేసిన పుస్తకాన్ని రేపు గాంధీభవన్‌ లో విడుదల చేయనున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్‌ ప్రజాపాలనను గత పదేళ్ళ బీఆర్‌ఎస్‌ విధ్వంస పాలనను విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ గౌడ్‌ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను సంకలనం చేశారు. ఈ పుస్తకాన్నిరేపు మంగళవారం గాంధీభవన్‌ లో నూతన కార్యవర్గ సమావేశంలో ఆవిష్కరించనున్నారు. ఏఐసీసీ ఇంఛార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లుభట్టి విక్రమారక్క, మంత్రులు, శాసనసభ్యులు ఇతర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల మధ్య ఈ పుస్తకాన్న ఆవిష్కరించనున్నారు.

విధ్వంసం నుంచి వికాసం సంకలనంలో మహేష్ కుమార్ గౌడ్ వివిధ పత్రికల్లో రాసిన 36 వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం దాదాపు 260 పేజీలు ఉంది. ‘‘ఇందిరమ్మ రాజ్యం’’ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ వ్యాసాలు ఉపయోగపడతాయనే భావనలో టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ నినాదంతో వికాసం దిశగా తీసుకెళ్తున్న ప్రగతిని ఈ వ్యాసాలు ప్రతిబింబిస్తాయని చెపుతున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story