ఆదివారం నిజామాద్ కు హోంమత్రి అమిత్ షా
పసుపు బోర్డు ప్రారంభించనున్న అమిత్ షా

నిజామాబాద్ జిల్లా వాసుల దశాబ్ధాల కల జూన్ 29వ తేదీ నెరవేరనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాలన్ని ఈ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 11.25 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి 1.45 గంటలకు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో నిజామాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్ళనున్నారు. కలెక్టరేట్ నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి రోడ్డు మార్గంలో చేరుకుని ఆ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కంఠేశ్వర్ క్రాస్రోడ్ లో ఏర్పాటు చేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దివంగత డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం తరువాత 2.45 గంటల నుంచి 4 గంటల వరకూ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొంటారు. తిరిగి 5 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. నిజామాబాద్ నుంచి బేగపేంట విమానాశ్రయం చురుకున్న తరువాత తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులతో అరగంట పాటు భేటీ అయి కొన్ని కీలక అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
