హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్ళను... మిస్ బ్రెజిల్

"నేను బ్రెజిల్కి తిరిగి వెళ్ళను! విమానం మిస్ అయినట్టు నటిస్తా!" అని నవ్వుతూ చెప్పింది మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో. హైదరాబాద్ తన మనసును దోచేసిందని పేర్కొంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో పొలిటెంట్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇక్కడ ప్రతీదీ అద్భుతంగా ఉందని, అస్సలు ఎలాంటి ఒత్తిడీ అనిపించడం లేదని, టీం నుంచి హోటల్ స్టాఫ్ వరకూ అందరూ ఎంతో ప్రేమగా గమనిస్తున్నారని, తమను ప్రోత్సహిస్తూ గిఫ్టులు కూడా ఇస్తున్నారని జెస్సికా తెలిపారు. తాను వచ్చిన మొదట్లో మసాలా ఫుడ్ అంటే భయంగా అనిపించినప్పటికీ.. ఇప్పుడు తనకు నచ్చిపోయాయని, నాన్ బ్రెడ్ బాగా నచ్చిందని, ఫెర్మెంటెడ్ రైస్ కూడా చాలా ఇష్టంగా తిన్నానని చెప్పారు. భారతీయ సంగీతం గురించి మాట్లాడుతూ, నాజీ నాజీ సాంగ్ తనకు ఇన్స్పిరేషన్ సాంగ్ అని, ఈ పాట తన మనసును తాకిందని, అది తనకు ప్రేరణనిస్తుందని అన్నారు.
తాను ఒక టీచర్గా పనిచేస్తున్నానన్న జెస్సికా.. తాను మిస్ వరల్డ్ పోటీల్లో గెలిస్తే.. ప్రపంచాన్ని ఒక పెద్ద తరగతిగా మార్చేస్తానని, ప్రతి రోజు నేర్చుకుంటూ, తన పరిజ్ఞానాన్ని పంచుకుంటానని, ప్రతి విద్యార్థిని ఉత్తమంగా మార్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
