తెలంగాణ భవన్‌కు ఎందుకు రాలేదని బీఆర్‌ఎస్ ప్రశ్న

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణలో బీఆర్‌ఎస్‌ న్యాయవాదుల ప్రశ్నలు.. కేసీఆర్‌ను కలిశారా?

పార్టీ మారకపోతే భవన్‌కు ఎందుకు రాలేదు: న్యాయవాదులు

కాంగ్రెస్‌లో చేరకపోతే ఆందోళనల్లో పాల్గొన్నారా?

కాంగ్రెస్‌ కండువా కప్పుకోలేదా? అసెంబ్లీలో కలిసి కూర్చోలేదా?

ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్యలకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌

బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డిల విచారణ 4న

స్పీకర్‌ సమక్షంలో విచారణ.. ఫిర్యాదుదారులు సంజయ్, ప్రభాకర్‌

BRS: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాదులు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్యలను పలు ప్రశ్నలు వేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీలో చేరకపోతే తెలంగాణ భవన్‌కు ఎందుకు రాలేదు? బీఆర్‌ఎస్‌ ఆందోళనల్లో ఎందుకు పాల్గొనలేదు? గులాబీ కండువా ధరించారా? పార్టీ అధినేత కేసీఆర్‌ను ఒక్కసారైనా కలిశారా? అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారా??’’ అని ప్రశ్నించారు.

ఫిరాయింపు ఫిర్యాదులు చేసిన డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్‌ల తరఫున న్యాయవాదులు ఈ ప్రశ్నలు సంధించారు. ఇంతకుముందు సెప్టెంబరు 29న ఫిర్యాదుదారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్, ప్రభాకర్‌లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డిల తరఫు న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు.

తాజాగా బుధవారం అసెంబ్లీలో స్పీకర్‌ సమక్షంలో ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలపై విచారణ జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డిల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అక్టోబర్‌ 4న జరగనుంది. ఈ విచారణలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయానికి కీలకమవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story