చిరుధాన్యాలపై పరిశోధనకు హైదరాబాద్ లో అంతర్జాతీయ సంస్థ
International organization to set up in Hyderabad for comprehensive research on millets

మిల్లెట్స్ పై సమగ్ర రీసెర్చ్ కోసం హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఆన్ మిల్లెట్ సంస్థను తెలంగాణకి కేంద్రం మంజూరు చేసిందని ఈరోజు హైదరాబాద్ లో వెల్లడించారు.
ఇందులో సెంట్రల్ ల్యాబ్ , ఇంటర్నేషల్ హాస్టల్, మిలెట్స్ మ్యూజియం వంటి ఎన్నో ఈ సంస్థలు రాబోతున్నాయన్నారు. రాష్ట్రానికి రైల్వే సెక్యూరిటీకి సంబంధించి ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‘ సంస్థ మంజూరైందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో దీని ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దాదాపు 300 కోట్లు ఈ ప్రాజెక్టు కు మంజూరు చేసిందన్నారు.
రైల్వే నెట్వర్క్ లో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత దేశం ఉందని కేంద్రమంత్రి తెలిపారు. రైల్వే ప్రమాదంలో జీరో స్థానంలో ఉండాలని కవచ్ అభివృద్ధికి భారీ ప్రణాళికల్ని కేంద్రం సిద్దం చేసిందన్నారు. తెలంగాణకు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (NSTI)ను 60 వేల కోట్ల రూపాయలతో దేశంలో ఐటిఐ లను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐదు చోట్ల పెడుతున్న NSTI ఒకటి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని, ITIలకి నైపుణ్యం నేర్పే దిశగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఇటీవల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 53 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు కు కేంద్రం ఓకే చెప్పిందని కేంద్రమత్రి తెలిపారు. అదనంగా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యం సేకరణలో నయా పైసా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంపై పడదని కేంద్రమే అన్ని భరిస్తుందన్నారు. అదనపు సెంటర్స్ ఏర్పాటు చేసి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
