115 మందిని ఎంక్వయిరీ చేసిన పీసీఘోష్ కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిటీ విచారణ పూర్తయ్యింది. ఇప్పటివరకు పీసీఘోష్ కమిషన్ మొత్తం 115 మందిని కాళేశ్వరం విషయంలో విచారణ చేసింది. చివరగా 115వ వ్యక్తాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించడం ద్వారా.. కమిషన్ తుది విచారణను పూర్తి చేసింది. అంతకు ముందు మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులను కూడా కమిషన్ విచారించింది. తెలంగాణ సచివాలయానికి కూత వేటు దూరంలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ కేంద్రంగా పదిహేను మాసాలుగా పీసీ ఘోష్ ఏకసభ్య కమీషన్ పనిచేస్తోంది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి గత సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీన జస్టిస్ పీసీఘోష్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించింది. ఈ పదిహేను నెలల కాలంలో జస్టిస్ పీసీ ఘోష్ మొత్తం 115 మందిని విచారించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీఆర్కే భవన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఒకసారి వాయిదా పడిన తర్వాత.. ఎట్టకేలకు కాలేశ్వరం విచారణ కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో కమిషన్ కు తప్పు అనిపించిన విషయాలను ప్రశ్నల రూపంలో కేసీఆర్ ఎదుట సంధించింది. దానికి ఆయన సమాధానం చెప్పారు. కొన్ని ఫైళ్ళు కూడా కమిషన్ కు అందించారు. ఒక పుస్తకాన్ని కూడా కమిషన్ సభ్యులకు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన విచారణ దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. విచారణ పూర్తయిన తర్వాత ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లిపోయారు. కాలేశ్వరం కమిషన్ లో జస్టిస్ ఘోష్, కమిషన్ సెక్రటరీ మురళీధర్ కెసిఆర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. విచారణ నేపథ్యంలో బిఆర్కే భవన్ మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు. అక్కడికి మీడియా ప్రతినిధులను రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ఇక గులాబీ కార్యకర్తలను చాలా దూరం నుంచే పోలీసులు నిలువరించారు. గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులును విచారించారు, సీనియర్ నాబి ఆర్ కే భవన్ లో విచారణకు హాజరైంది కేసీఆర్ మాత్రమే కాదు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ భవనంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. మొత్తంగా ఈ భవనంలో అధికారులు నిర్వహించిన విచారణకు హాజరైన రెండవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతుందని భావించారు. కమిషన్ కూడా మీడియాకు ఇదేవిధంగా లీకులు ఇచ్చింది. కానీ తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కెసిఆర్ వన్ టు వన్ విచారణను కోరారు. ఆయన విజ్ఞప్తిని అంగీకారంలోకి తీసుకున్న ఘోష్.. లోపలికి 9 మందిని అనుమతించింది. అందులోకి వెళ్ళిన వారిలో హరీష్ రావు, పద్మారావు గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, వద్దిరాజు రామచంద్రను లోపలికి అనుమతించారు. అయితే ఈలోగా బయట ఉన్న కేటీఆర్ మీడియా సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పై బిజెపి, కాంగ్రెస్ సంయుక్తంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ చేసిన విచారణలో నిజాలు మొత్తం బయటపడతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. అయితే ఒకట్రెండు రోజుల్లో జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ కాళశ్వరంపై పూర్తి చేసిన విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో బీఆర్కే భవన్లో విచారణకు కేసీఆర్ మాత్రమే కాదు.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లారు. గతంలో మల్లెల బాబ్జి పై హత్యాయత్నం జరిగినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసులో ఆయన విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.. మాజీ ముఖ్యమంత్రి హోదాలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బిఆర్కే భవన్లో విచారణ ఎదుర్కొన్న రెండవ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story