Kishan Reddy: సింగరేణి కొల్లీరీలు నష్టాల బారిన పడటానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీల పాలసీలు, నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా ‘సింగరేణి భరోసా యాత్ర’లో భాగంగా భూపాలపల్లి ప్రాంతంలో అతను పర్యటించారు.

గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ నేతలు సింగరేణి కార్మికుల శ్రమను దోచుకున్నారని, సంస్థను ఆర్థికంగా దివాళా తీసే స్థితికి తెచ్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కార్మికులకు చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

“ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణి కార్మికులు రోజువారీ పని చేస్తున్నారు. వారి భవిష్యత్తు రక్షించడం అందరి బాధ్యత” అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ యాత్ర ద్వారా సింగరేణి సమస్యలను ప్రజల ముందుకు తెచ్చి, సంస్థను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని నేతలు హామీ ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story