Maoist Sujatha: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు
సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు

Maoist Sujatha: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకురాలు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన శనివారం (సెప్టెంబర్ 13, 2025) తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాలకు చెందిన సుజాతక్క, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా, ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో సౌత్ సబ్-జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1984లో మావోయిస్టు అగ్రనేత కిషన్జీని వివాహం చేసుకున్న ఆమె, 2011లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ మరణించిన తర్వాత కూడా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగారు.
సుజాతక్కపై మొత్తం 106 కేసులు నమోదై ఉండగా, ఆమెపై రూ.1 కోటి రివార్డ్ ఉంది. సుజాతక్కతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. సుజాతక్క మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో ఏకైక మహిళా నాయకురాలిగా ఉన్నారని, ఆమె లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
