ఔటర్ రింగురోడ్డు నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పిజెఆర్ ఫ్లైఓవర్ ని రేపు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్‌ బాధల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రయాణ సయం కూడా ఆదా అవుతుంది.

ఈ ఫ్లైఓవర్‌ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద రూ. 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కి.మీ పొడవు మరియు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌లతో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవ అంతస్తు నిర్మాణం. క్రింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది, దాని పైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది.తాజాగా ఇప్పుడు దాని పైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చేరవలసిన గమ్యస్థానాలను వేగంగా చేరుకోవచ్చు.

కొండాపూర్ ప్రాంతం నుండి, శంషాబాద్ విమానాశ్రయం అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు SRDP పెద్ద పునాది వేసిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ ద్వారా 23వ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. SRDP ద్వారా ఫ్లైఓవర్లు చేపట్టినా, నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిర్ణీత సమయంలో నేరుగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

SRDP ద్వారా చేపట్టిన మొత్తం 42 పనులలో 37 పనులు ఈ ఫ్లైఓవర్‌తో పూర్తయ్యాయి. ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు శాస్త్రిపురం ROB పనుల రైల్వే భాగాన్ని రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లక్ష్యంగా పెట్టుకుని రైల్వే అధికారులను కోరారు. జూలై చివరి నాటికి ఫలక్‌నుమా ROB పనులను, ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ROB పనులను పూర్తి చేయాలని కమిషనర్ వారికి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ రెండు ROBలు పూర్తయితే, 39 SRDP పనులు పూర్తవుతాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణించవచ్చు.

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానకి అంతర్జాతీయ స్ధాయి గుర్తింపు తీసుకురావడానికి మౌలిక సదుపాయాలకు పెద్ద పునాది వేశారు. గతంలో జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన హామీ ప్రకారం, నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేయబడ్డాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతోంది. ప్రజా ప్రభుత్వం పాలన కింద, నగర అభివృద్ధి కోసం రూ. 7032 కోట్ల వ్యయంతో 58 పనులను హెచ్‌ సిటీ ద్వారా చేపట్టనుంది. వీటిలో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, 4 ROBలు, 03 రైల్వే అండర్‌బ్రిడ్జిలు మరియు 10 రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిపాదించబడ్డాయి. ఈ పనులు టెండర్ దశలో పూర్తయ్యాయి మరియు ఒప్పంద దశలో ఉన్నాయి. ఈ పనులలో కొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయ

Politent News Web 1

Politent News Web 1

Next Story