రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన దెయ్యం... కేటీఆర్

- తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్ లో ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ తాము నేషనల్ హెరాల్డ్ స్కామ్ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయడానికే లేఖల పై మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, మా పార్టీ కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకూ ఎవరైనా ఒకటే అని ఎవరికీ ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవని పేర్కొన్నారు. మా అధ్యక్షుడికి ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు, లేఖలు కూడా రాయవచ్చని స్పష్టం చేశారు. అయితే ఎంతటి వారైనా సరే పార్టీ వ్యవహారాలను అంతర్గత వేదికలపైనే చర్చించాలని అన్నారు. అన్ని పార్టీలలో కోవర్టులు ఉన్నట్లే మా పార్టీలో కూడా కోవర్టులు ఉన్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ మీద ఉన్న ఆరోపణలను డైవర్ట్ చేయడానికి మా పార్టీ వ్యవహారాలను మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యడ్యూరప్ప పై అవినీతి ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని ఇప్పుడు రేవంత్ కూడా రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని అన్నారు. గతంలో జరిగింది ఓటుకు నోటు కేసైతే ఇప్పుడు జరుగుతోంది నోటికి సీటు కేసు అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలను ప్రశన్నం చేసుకోవడానికే 44వ సారి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు స్పందిచరని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి పై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదన్నారు. బీజేపీకి నిజాయితీ ఉంటే స్కాములపై స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అన్నారు. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. గవర్నర్ ని కలసి సీయం అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
