ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.

Rythu Bharosa Funds: సీఎం రేవంత్ రైతు నేస్తం వేదిక నుంచి భరోసా నిధులను విడుదల చేశారు. సీఎం రైతులు బ్యాంకు ఖాతాల్లోకి ఆన్ లైన్ లో మీటనొక్కి నిధులను జమ చేశారు. రైతుల ఖాతాల్లోకి 9రోజుల్లో 9వేలకోట్లు జమ అవుతాయని ప్రకటించారు. అంతకు ముందు రైతు నేస్తం కార్యక్రమాన్ని 1034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి రైతులతో నేరుగా మాట్లాడారు. వ్యవసాయ విద్యార్థులు స్వయంగా వెళ్లి రైతులు చెప్పిన అనుభవాలను చూసి నేర్చుకోవాలని సూచించారు.

ప్రభుత్వంలోని కీలక శాఖలు ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయశాఖలను ఖమ్మం జిల్లాకే ఇచ్చామని, ఖమ్మం కు చెందిన రైతుతో మాట్లాడుతున్న సందర్భంగా చమత్కరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story