సంస్ధ ప్రతినిధులను కోరిన సీయం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ లో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్ధను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ సంస్ధ ఎండీ, సీఈఓ జైతీర్థ్‌ ఆర్‌ జోషిని కోరారు. బుధవారం జూబ్లీహిల్స్‌ లోని సీయం నివాసంలో ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు వెంట బ్రహ్మోస్‌ ఏరోస్పేస్ ప్రతినిధులు రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీయం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌, బెంగుళూరు ఢిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పటు చేసేందు అనుకూలమైన ప్రాంతాలని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ లో రక్షణ శాఖకు సంబంధించిన పలు కీలక సంస్థలు ఉన్నాయని సీయం ఏరోస్పేస్‌ ప్రతినిధులకు చెప్పారు. అలాగే దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని అన్నారు. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్‌ లను ఎంచుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీయం రేవంత్‌ రెడ్డి బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సీయం ప్రతిపాదనకు బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ బృందం సానుకూలంగా స్పందించింది. సీయం రేవంత్ రెడ్డిన కలిసిన వారిలో బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌ ఎండీ జైతీర్ధ్ తో పాటు బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు ఉన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story