State Agriculture and Farmers Welfare Commission: సుస్థిర వ్యవసాయానికి పంటల మార్పిడి తప్పనిసరి.. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచన
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచన

State Agriculture and Farmers Welfare Commission: తెలంగాణలో రైతుల ఆదాయం పెంపు, నేల సారవంతత పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం కోసం పంటల మార్పిడి విధానాన్ని వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. ఒకే రకం పంటలపై అధికంగా ఆధారపడటం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
భవిష్యత్తులో ఆహార భద్రతను కాపాడటానికి, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడానికి పంటల వైవిధ్యం కీలకమని పేర్కొంది. స్థానిక వాతావరణం, నీటి లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంటల ఎంపిక జరగాలని సూచించింది.
సహజ వనరుల సంరక్షణతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు కూడా పంటల మార్పిడి ఉపయోగపడుతుందని కమిషన్ తెలిపింది. రైతులకు అవగాహన కల్పించడం, ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా ఇవ్వడం, అవసరమైన సాంకేతిక సలహాలు అందించడం వంటి చర్యలను ప్రభుత్వం ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించింది.

