భాజపాకు నష్టం లేదు: రామచందర్‌రావు

Telangana Bharatiya Janata Party (BJP) President N. Ramachandra Rao: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాల మధ్య ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే అంశంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు స్పష్టమైన స్పందన తెలిపారు. ఎవరైనా కొత్త పార్టీలు స్థాపించుకోవడం సహజమేనని, అందులో భాజపాకు ఎలాంటి నష్టం ఉండదని ఆయన అన్నారు.

ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రామచందర్‌రావు, "కేఏ పాల్‌ కూడా పార్టీ పెట్టారు కదా! కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్న విషయం వారి కుటుంబ వ్యవహారం. ఆమె పార్టీ స్థాపన వల్ల మా పార్టీకి ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రజలు ఇప్పుడు భాజపా వైపే చూస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వీబీ జీ రామ్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. "ఈ పథకం ద్వారా ఎవరికీ నిజమైన మేలు జరగలేదు. పారదర్శకత లేని స్కీమ్‌లనే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటోంది" అని రామచందర్‌రావు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాజకీయాల్లో భాజపా బలోపేతం కావడంతో ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఆయన పరోక్షంగా సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story