Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

Telangana Panchayat Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు సాగింది. క్యూలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పించిన అనంతరం పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుపుతారు.
ఈ దశలో మొత్తం 3,752 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్ స్థానాలు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చోట్ల చలి తీవ్రత ఉన్నప్పటికీ, మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినా, మిగతా చోట్ల ప్రశాంత వాతావరణం నెలకొంది.
ఈ మూడు దశల ఎన్నికలతో తెలంగాణలో గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవనుంది. ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది.

