మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా ఎంపిక

Central Secretary of CPI (Maoist): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ నియమితులయ్యారు. మే 21, 2025న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ 28 మంది సహచరులతో సహా మరణించడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో తిరుపతిని కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు, అలాగే బస్తర్ బాధ్యతలను హిడ్మాకు అప్పగించారు.

తిరుపతి 1983లో మావోయిస్టు పార్టీలో చేరి, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో దంతెవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడిలో 74 మంది జవాన్లు మరణించారు. తిరుపతిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. దళిత సామాజిక వర్గానికి చెందిన తిరుపతి, కరీంనగర్ జిల్లాలోని కొరట్లలోని అంబేద్కర్ నగర్‌కు చెందినవాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story