కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతి

Tummala Nageswara Rao: వానాకాలం సీజన్‌లో తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియా ఎరువును సకాలంలో, అవసరం మేరకు సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు.

బుధవారం కేంద్ర మంత్రి దిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుమ్మల మాట్లాడారు. తెలంగాణలో రైతు నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ)లో 112 శాతం లక్ష్య సాధనతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, వచ్చే మూడు నెలల్లో మిగిలిన నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.

ఈప్రిల్ నెలలో తెలంగాణకు కేంద్రం రెండు లక్షల టన్నుల యూరియా కేటాయించిందని, రాబోయే రెండు నెలల్లో నెలకు రెండు లక్షల టన్నుల చొప్పున రాష్ట్రానికి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల విన్నవించారు. ఇది వానాకాలం పంటల సమయంలో రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా సహాయపడుతుందని వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కింద ఈ నెల 2 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో ప్రకృతి సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, జీవ ఎరువుల వాడకం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల నుంచి రాష్ట్రస్థాయి అధికారులను 32 జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తుమ్మల తెలిపారు.

ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story