లేకపోతే జరిమానా తప్పదు!

Traffic Rules : ద్విచక్రవాహనం లేదా కారుతో బయటకు వెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేస్తే భారీ జరిమానాలు తప్పవు. రోడ్డుపై పోలీసులు లేదా ఆర్టీఏ అధికారులు ఎవరూ పట్టుకోకపోయినా, ఫొటోలు తీయకపోయినా అనుకోవడం పొరపాటు. రహదారులపై ఏఐ సాంకేతికతతో కూడిన అత్యాధునిక కెమెరాల ద్వారా ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విస్తృతంగా అమలవుతోంది. అదే సమయంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రోజుకు రూ.2.25 కోట్ల జరిమానాలు

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి-జూన్) వాహనదారులపై రూ.412 కోట్ల జరిమానాలు విధించారు, అంటే సగటున రోజుకు రూ.2.25 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో విధించిన రూ.265 కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 56 శాతం పెరుగుదల ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మొత్తం రూ.800 కోట్లు దాటే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఈ డిసెంబరు నాటికి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 30 శాతం తగ్గాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు వరకు తనిఖీలు, చలాన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏఎన్‌పీఆర్ కెమెరాల పనితీరు

రోడ్లపై అమర్చిన ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు వాహన నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని పంపుతాయి. వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, బీమా గడువు వంటి వివరాలను సిస్టమ్ తనిఖీ చేస్తుంది. ట్రాఫిక్ నియమ ఉల్లంఘనలను తక్షణమే గుర్తిస్తుంది.

ఆటోమేటిక్ ఈ-చలాన్

సిగ్నల్ జంప్, స్టాప్‌లైన్ దాటడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం వంటి ఉల్లంఘనలను ఈ కెమెరాలు వెంటనే గుర్తించి, ఆటోమేటిక్‌గా ఈ-చలాన్ జారీ చేస్తాయి.

కెమెరాల సంఖ్య

పోలీస్ శాఖ: 792 ఏఎన్‌పీఆర్ కెమెరాలు అమర్చింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 549, జిల్లాల్లో 243 ఉన్నాయి.

రవాణా శాఖ: 60 కెమెరాల అమరిక కోసం టెండర్లు పిలిచింది. అధిక ప్రమాద ప్రాంతాల్లో 100 ఈ-ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాల అమరిక కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story