Telangana Gram Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు భారీ ఆధిక్యంలో నిలిచారు. తొలి దశలోనే అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్, రెండో దశలోనూ తన బలాన్ని చాటుకుంటోంది.

193 మండలాలకు చెందిన 3,911 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

సాయంత్రం 5 గంటల వరకు అందిన పాక్షిక ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులు 600కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతుదారులు 200కు పైగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులు 70 స్థానాల్లో, ఇతరులు (స్వతంత్రులు లేదా ఇతర పార్టీలు) 200కు పైగా స్థానాల్లో గెలుపొందారు.

కాంగ్రెస్ నేతలు ఈ ఫలితాలతో ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారని, ఈ విజయాలు పార్టీ బలోపేతానికి నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు. మిగతా ఫలితాలు రావడం పూర్తి చిత్రం స్పష్టమవుతుందని అంచనా వేస్తున్నారు.

Next Story